వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభం

by Naga Rani Yarlagadda |

తిరుపతిలో వృద్ధుల కోసం ఉచితంగా బాలాజీ దర్శన పథకం ప్రారంభమయింది.

వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో వృద్ధుల కోసం ఉచితంగా బాలాజీ దర్శన పథకం ప్రారంభమయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు ఈ పథకానికి అర్హులు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఎస్ 1 కౌంటర్ వద్ద ఫొటో గుర్తింపు కార్డుు, వయస్సు ధృవీకరణ పత్రం చూపితే దర్శనానికి అనుమతిస్తరు.

వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా దేవాలయం కుడిగోడ వెంబడి ముందుకు వెళ్లాలి. దర్శనానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. క్యూ లైన్లోకి వెళ్లాక 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుంది. దర్శనానంతరం భక్తులకు ఉచిత భోజనంతో పాటు వేడి పాలు అందిస్తారు. సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం హెల్ప్ డెస్క్ నంబర్ 87722 77777 ను సంప్రదించవచ్చు.

Next Story