పార్టీ మార్పుపై టీడీపీ నేత క్లారిటీ..

by Dishanational4 |
పార్టీ మార్పుపై టీడీపీ నేత క్లారిటీ..
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీని వీడతానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న స్పందించారు. కావాలనే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బ‌తికి ఉన్నంత కాలం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే ఉంటాన‌ని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న స్పష్టం చేశారు. టీడీపీని వీడతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇకపోతే విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి బుద్ధా వెంకన్న హాజరయ్యారు.

అయితే స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. వేదికపైకి వెళ్లొద్దని ఆయనను వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో బుద్ధా వెంకన్న టీడీపీని వీడబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై విశాఖలో బుధవారం స్పందించారు. అలాంటి ఆలోచనేదీ తనకు లేదని, కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed