బ్రేకింగ్: ఏలూరులో టీడీపీకి భారీ ఎదురు దెబ్బ.. వైసీపీలో చేరిన కీలక నేత!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: ఏలూరులో టీడీపీకి భారీ ఎదురు దెబ్బ.. వైసీపీలో చేరిన కీలక నేత!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలో ప్రతిపక్ష టీడీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కైకలూరు టీడీపీ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, టీడీపీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న అంతర్గత పరిణామాలు.. వచ్చే ఎన్నికల్లో కైకలూరు టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతోనే వెంకటరమణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకే వెంకటరమణకు వైసీపీ కండువా కప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా వెంకటరమణకు ప్రభుత్వం నలుగురు గన్ మెన్లను కల్పించింది.

Next Story

Most Viewed