- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఈనెల 30కు వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో శుక్రవారం వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఆరుగురు నిందితుల రిమాండ్ను ఈ నెల 30 వరకు పొడిగించింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 30కు వాయిదా వేసింది. అనంతరం నిందితులను అధికారులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.
Next Story