మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై మాజీమంత్రి కేఎస్ జవహర్ ఫైర్

by Disha Web Desk 12 |
మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై మాజీమంత్రి కేఎస్ జవహర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై మాజీమంత్రి కేఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సురేష్ చర్యలు మాదిగ జాతికి తలవంపులు తెస్తున్నాయి అని ఆరోపించారు. ఏనాడైనా దళితుల గురించి సురేశ్ పోరాడాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేశ్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు అని హెచ్చరించారు. మంత్రి సురేశ్ అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సింది తాడేపల్లి ప్యాలెస్ ముందు అని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం పోయినపుడు చొక్కా విప్పితే బావుండేది అని హితవు పలికారు. దుర్గి ,నెల్లూరు లిడ్ కాప్ భూములు అన్యాక్రాంతం అయినప్పుడు సురేశ్ ఎక్కడ? అని నిలదీశారు.

మలుపు, ముందడుగు పథకాలు కనుమరుగైనపుడు ఏమయ్యాడు అని ప్రశ్నించారు. వరప్రసాద్ శిరోముండనపుడు సురేశ్ ఏ కలుగులో దాక్కున్నాడు అని నిలదీశారు. నీ ప్రాంతంలో దళితులకు నీవేమి చేశావో చెప్పాలి అని సవాల్ విసిరారు.దళిత బాంధవుడు చంద్రబాబుని అనే అర్హత నీకు లేదు అని హెచ్చరించారు. డా. సుధాకర్ మరణం సుబ్రహ్మణ్యం మరణం నీకు కనిపించ లేదా? అని నిలదీశారు.మంత్రి సురేశ్ జాతి ద్రోహి దళితులకు చేసిందేమి లేదు..సురేశ్ చర్యలను ప్రతి దళితుడు వ్యతిరేకించాలి అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed