జోగి, అద్దేపల్లి బ్రదర్స్‌కు బిగ్ షాక్.. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-06 08:05:03  IST  )

మాజీ మంత్రి జోగి రమేశ్, అద్దేపల్లి జనార్ధాన్ రావు బ్రదర్స్‌కు బిక్ షాక్ తగిలింది.

జోగి, అద్దేపల్లి బ్రదర్స్‌కు బిగ్ షాక్.. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్, అద్దేపల్లి జనార్ధాన్ రావు బ్రదర్స్‌కు బిక్ షాక్ తగిలింది. నకిలీ మద్యం కేసులో మరింత విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న వీరిని విచేందుకు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది.

అయితే తమకు బెయిల్ ఇవ్వాలని జోగి, అద్దెపల్లి బ్రదర్స్ కోరుతున్నారు. ఈ సమయంలో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరంతా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా ఇదే కేసులో ఏడుగురు నిందితులను విజయవాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. వీరందరినీ 7 నుంచి 11 రోజులు పాటు విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story