వైసీపీలోకి పోతిన మహేశ్... తప్పేంటంటూ హాట్ కామెంట్స్

by Disha Web Desk 16 |
వైసీపీలోకి పోతిన మహేశ్... తప్పేంటంటూ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి పోతిన మహేశ్ గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సోమవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితాన్ని చంపేశారని ఆరోపించారు. ఇక రాబోయేది తన రాజకీయ పునర్జన్మ అని వ్యాఖ్యానించారు. ఇక తన ఇష్టమొచ్చిన జెండా పట్టుకున్నానని చెప్పారు. తాను వైసీపీలో చేరితే తప్పేంటని పోతిన మహేశ్ ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నట్లు డైరెక్ట్ గా పోతిన మహేశ్ హింట్ ఇచ్చారు.

మరోవైపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని విజయవాడలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు జనసేనలో ఉన్న ఆయన.. పార్టీని వీడటంపై అటు జనసేన నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. పోతిన మహేశ్ పార్టీ కోసం కాకుండా స్వలాభం కోసం చేరారని మండిపడ్డారు. పోతిన మహేశ్ పార్టీలోనే ఉంటే భవిష్యత్తులో కచ్చితంగా పవన్ కల్యాణ్ న్యాయం చేసేవారిని జనసేన పార్టీ నేతలు తెలిపారు. తొందరపడి పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారని పేర్కొన్నారు.

Read More..

జగన్‌ రెడ్డి‌వి మొత్తం హత్యా రాజకీయాలే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed