దేశంలో మొట్టమొదటిసారిగా.. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత CBN ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 4 |
దేశంలో మొట్టమొదటిసారిగా.. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత CBN ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాను నేడు రిలీజ్ చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 118 స్థానాలకు గాను 94 టీడీపీ, 24 జనసేలు పంచుకున్నాయి. టీడీపీ మొత్తం 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా.. జనసేన మాత్రం 5 సీట్లలో అభ్యర్థులను అనౌన్స్ చేసింది. పవన్ కల్యాన్, నాగబాబు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారన్న అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తొలి జాబితా విడుదల తర్వాత ట్విట్వర్ వేదికగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ‘దేశంలో మొట్టమొదటిసారిగా... విస్తృత స్థాయిలో 1 కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి... నిజాయితీ, అంకితభావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా... ఎంపిక చేసిన తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది. ఏపీ ప్రజలారా! ఆశీర్వదించండి!!’ అంటూ ట్వీట్ చేశారు.

Read More..

వైసీపీకి స్ట్రోక్ ఇచ్చేలా టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్!

Next Story

Most Viewed