అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

by Muthe.Rajitha |

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన స్కూల్లో గురువారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ జరిగింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన స్కూల్లో గురువారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ జరిగింది. జిల్లాలోని జీకేవీధి (మం) జెర్రెల గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాత్రి భోజనం చేసిన విద్యార్థులంతా వాంతులు చేసుకొని, కడుపునొప్పితో విలవిలలాడారు. 29 మంది విద్యార్థులకు సీరియస్ కావడంతో తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Next Story