తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. రెండు రైళ్లలో చెలరేగిన మంటలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-14 09:44:31  IST  )

తిరుపతి రైల్వే స్టేషన్లో (Tirupati Railway Station) అగ్నిప్రమాదం జరిగింది.

తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. రెండు రైళ్లలో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి రైల్వే స్టేషన్లో (Tirupati Railway Station) అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ లూప్ లైన్ లో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మంటలు చెలరేగాయి. రెండు రైళ్లలోని బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగీలు పూర్తిగా కాలి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది ? ఎవరికైనా గాయాలయ్యాయా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Next Story