విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

by Ajay Maddhiboyina |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ద్రవ ఉక్కు కిందపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు అప్రమత్తమై అక్కడ నుండి పారిపోయారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ద్రవ ఉక్కు కిందపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు అప్రమత్తమై అక్కడ నుండి పారిపోయారు.ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటలను ఆర్పేశారు. దీంతో కార్మికులు ఊపిరి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఎండాకాలం కావ‌డంతో ఎక్కువ‌గా ఫైర్ యాక్సిడెంట్స్ జ‌రుగుతున్నాయి. ఈ రోజే హైద‌రాబాద్ లోని పాత‌బస్తీలో ఓ భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘట‌న‌లో ఏకంగా 17 మంది మ‌ర‌ణించారు. ఫైర్ సిబ్బంది ఆల‌స్యంగా రావ‌డం కూడా ప్ర‌మాద ఉదృతిగా కార‌ణం అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ‌ను ఆదేశించారు.

Next Story