- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మైనింగ్పై పోరు : రేపు ఛలో అసెంబ్లీకి జనసేన పిలుపు
by Seetharam |
ఈనెల 25న ఛలో అసెంబ్లీకి గుంటూరు జనసేన పార్టీ పిలుపునిచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఈనెల 25న ఛలో అసెంబ్లీకి గుంటూరు జనసేన పార్టీ పిలుపునిచ్చింది. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. వైసీపీ పాలకులు వ్యవస్థలను నిర్వీర్యం చేసి పాలనను పూర్తిగా గాలికి వదిలేశారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మైనింగ్ దోపిడీకి పాల్పడుతున్నారని వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే, ఇలాంటి పరిణామాల దాపురిస్తాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సోమవారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చినట్లు గాదె వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






