పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారు: పెనుమాక రైతుల తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |

రాజధాని అభివృద్ధి కోసం అమరావతి ప్రాంతంలో కూటమి ప్రభుత్వం మరోసారి భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ భూసేకరణపై పెనుమాక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారు: పెనుమాక రైతుల తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని(Capital) అభివృద్ధి కోసం అమరావతి(Amaravati) ప్రాంతంలో కూటమి ప్రభుత్వం(NDA Gogernment) మరోసారి భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ భూసేకరణపై పెనుమాక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిర్ధిష్ట పక్రియలో అధికారులు ముందుకెళ్లడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని, అయినా ఎవరికీ పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమస్యలపై కలెక్టర్ దగ్గరికి వెళ్తే స్పందడం లేదని ఆరోపించారు. సీఆర్డీఏ కమిషన్ కూడా తమకేమీ తెలియదంటున్నారని తెలిపారు. కానీ భూసేకరణకు మాత్రం కలెక్టర్ నోటీసులు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఎవరు సమాధానం చెబుతారని పెనుమాక రైతులు ప్రశ్నిస్తున్నారు.

Next Story