ఫేక్ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. తెలంగాణ వాసి రంగయ్య అరెస్ట్

by Vemula.Srinu Prasad |

ఫేక్ లిక్కర్ కేసులో మరో నిందితుడు రంగయ్యను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు..

ఫేక్ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. తెలంగాణ వాసి రంగయ్య అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు(Ibrahimpatnam fake liquor case)లో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా తెలంగాణ వాసి తలారి రంగయ్యను అరెస్ట్ చేశారు. నకిలీ లేబుల్స్ డిజైన్స్ చేయడంలో రంగయ్య దిట్ట.. ఈ కేసులోనూ ప్రముఖ పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తలారి రంగయ్యను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రంగయ్యకు డిసెంబర్ 9 వరకూ ధర్మాసనం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు.

Next Story