రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు

by Disha Web Desk 7 |
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా డక్కిలి మండలలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను ఢీకొట్టి మరీ పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాపూరు అడవులలో నుంచి కారులో ఎర్రచందనం తరలిస్తున్నారని రాపూరు ఎస్ఐకు సమాచారం వచ్చింది. డక్కిలి వైపుగా కారు వస్తుందని స్థానిక ఎస్ఐ నాగరాజుకి రాపూరు ఎస్ఐ సమాచారం ఇచ్చారు.

దీంతో ఎస్ఐ నాగరాజు స్మగ్లర్ల కారును వెంబడించారు. వెంబడించి కారుని సంగన్నపల్లి వద్ద ఆపేందుకు ప్రయత్నించారు.అయితే స్మగ్లర్లు ఎస్ఐపైకి కారును దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఎస్ఐ నాగరాజుకి తీవ్రగాయలయ్యాయి. అనంతరం స్మగ్లర్లు వాహనం వదిలేసి పరారయ్యారు. ఈ దాడిలో నలుగురు పాల్గొన్నారని ఎస్ఐ తెలిపారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారని స్పష్టం చేస్తున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్ఐ నాగరాజుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed