ఒళ్లు కొవ్వెక్కి వెళ్లి తన్నులు తినొచ్చాడు.. పట్టాభిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్

by Disha Web Desk 13 |
ఒళ్లు కొవ్వెక్కి వెళ్లి తన్నులు తినొచ్చాడు.. పట్టాభిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడునని అనుకునే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దివంగత సీఎం ఎన్టీఆర్‌ని పొట్టను పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. అంతేకాదు దొంగరాతలు రాసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్టీఆర్‌ని మానసికంగా కృంగదీసిన వ్యక్తి రామోజీ రావు అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం వైసీపీ పాలనపైనా రామోజీరావు పూర్తిగా స్థాయి దిగజార్చుకుని తప్పుడు రాతలు రాస్తున్నారు అని మండిపడ్డారు. పట్టాభిని కొట్టారని అంటూ ఎప్పుడో ఫోటోలు పెట్టీ తప్పుడు రాతలు రాశారని విమర్శించారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పట్టాభి ఏమైనా పై నుండి దిగి వచ్చాడా అంటూ మండిపడ్డారు. పిచ్చిరాతలు రాస్తే రామోజీ రావును, చంద్రబాబును బట్టలు వూడదీసి కొడతారు ఈ రాష్ట్ర ప్రజలు అని హెచ్చరించారు. 2020లో ఫోటోలు నీ టేబుల్ మీదకు ఎలా వచ్చాయి.. మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి టెక్నికల్ ప్రాబ్లెమ్ అని సిగ్గులేకుండా చెప్తున్నారు అని కొడాలి నాని మండిపడ్డారు. పట్టాభిని అసలు గన్నవరం ఎవరు వెళ్లమన్నారు అని కొడాలి నాని ప్రశ్నించారు.

ఒళ్లు బలిసి కొవ్వు ఎక్కువై వెళ్ళాడు తన్నులు తిన్నాడు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని తప్పు దోవ పట్టించడానికి పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపించాడు అని మండిపడ్డారు. గన్నవరం వెళ్లి వంశీనీ పిల్ల సైకో రారా గన్నవరం వచ్చా అమ్మ, అబ్బకి పుట్టుంటే అని అంటే ఊరుకుంటారా.. కర్ర పట్టుకుని వంశీని, వంశీ మనుషులుని కొట్టాలని వెళ్లి సీఐ బుర్ర పగలగొట్టాడు అని ఆరోపించారు. సీఐ తలపగలకొడితే కేసు పెట్టకుండా ఏం చేస్తారని ఎదురు ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అని పట్టాభి డ్రామాలు ఆడుతున్నారని ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలో ఈ 420 గాళ్ళందరికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు అని హెచ్చరించారు.

Next Story

Most Viewed