అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

by Disha Web Desk 1 |
అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్‌డె‌స్క్ : అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీల సమ్మె చేపట్టారని, కానీ సమ్మెను నిషేధించడం హేయమైన చర్య అని అన్నారు. అక్రమ జీవోలతో అంగన్వాడీల న్యాయ పోరాటాన్ని అడ్డుకోలేరని చెప్పారు. తక్షణమే జీవో నెం.2 ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అంతిమ విజయం అంగన్‌వాడీలదేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడబోతున్నారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed