డీఏల విడుదలపై సస్పెన్స్.. సీఎంపైనే ఉద్యోగుల ఆశలు

by Vemula.Srinu Prasad |

తమ సమస్యల పరిష్కారంపై కేబినెట్ సభ్ కమిటీతో ఉద్యోగుల చర్చలు ముగిశాయి...

డీఏల విడుదలపై సస్పెన్స్.. సీఎంపైనే ఉద్యోగుల ఆశలు
X

దిశ, వెబ్ డెస్క్: తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపింది. ప్రధానంగా 2018-19కు సంబంధించిన డీఏలు విడుదల చేయాలని మంత్రులను ఉద్యోగులు కోరారు. అలాగే పీఆర్సీ అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. 7 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు పోలీసుల సమస్యలపైనా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు సిబ్బంది సరెండర్ లీవులు, పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కారుణ్య నియామకాలు సైతం పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా ఈ దీపావళికి రెండు డీఏలన్నా విడుదల చేయాలని మంత్రులకు సూచించారు. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు మంత్రులు తెలిపారు.

Next Story