టీడీపీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీసులు

by Disha Web Desk 2 |
టీడీపీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌పై రాయి దాడి ఘటన తర్వాత సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని వైసీపీ నేత మల్లాది విష్ణు సీఈవోకు ఫిర్యాదు చేశారు. జై టీడీపీ, తెలుగుదేశం అకౌంట్ల నుంచి అనుచిత పోస్టులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ టీడీపీ జనరల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై, పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై హత్యాయత్నం కేసులో కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ గుట్టు బయటపడుతుందనే భయంతోనే టీడీపీ నేతలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed