Election Commission: ‘ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి’.. వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు ఆదేశాలు జారీ

by Disha Web Desk 1 |
Election Commission: ‘ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి’.. వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని వస్తున్న వార్తలను కొట్టి పడేసింది. ఓటు వేసేందుకు ఆధార్ అవసరం లేదని, ప్రభుత్వం తరపున జారీ చేసిన ఏ గుర్తిపు కార్డైనా చూపించి ఓటు వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే స్వచ్ఛందగా ఒక దానిని రద్దు చేసుకోవాలని విజ్క్షప్తి చేశారు.



Next Story

Most Viewed