రాష్ట్రంలో పోలింగ్ టైమింగ్స్ విడుదల.. ఆ ప్రాంతాల్లో అనూహ్య మార్పులు

by Disha Web Desk 9 |
రాష్ట్రంలో పోలింగ్ టైమింగ్స్ విడుదల.. ఆ ప్రాంతాల్లో అనూహ్య మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేడు ముగింపు పలికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారాలు ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసింది. ఏపీలో 6 నియోజక వర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. కాగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుందని ఈసీ వెల్లడించింది. పాలకొండ, కురుపాలం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుందని తెలిపింది. ఓటింగ్ సమయం ముగిసినప్పటికీ ఆ సమయంలోగా క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఈసీ పేర్కొంది.

Next Story

Most Viewed