- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Allavaram:అల్లవరంలో గుసగుసలు.. ఎంపీడీవో బదిలీ వేటు ప్రచారంపై వాస్తవమెంత?

దిశ, అల్లవరం: ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ లో రాష్ట్రంలోనే అల్లవరం మండలం మొదటి స్థానం. పింఛన్లు పంపిణీలో జిల్లాలో అగ్రస్థానం. కుల గణనలో జిల్లాలో ప్రథమం. రాష్ట్రంలో ద్వితీయం. ఇలా అల్లవరం మండలం ఎంపీడీవో గా ఆయన వచ్చాక మారిన పరిస్థితి. అయితే గత కొన్ని నెలలుగా అల్లవరం ఎంపీడీవో బి.కృష్ణమోహన్పై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయా? దీని వెనుక ఎవరున్నారు? ఇదే అల్లవరం మండలం లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. వైసీపీ ప్రభుత్వంలో అల్లవరం ఎంపీడీవోగా బాద్యతలు స్వీకరించిన కృష్ణమోహన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంపించేస్తారని అంతా అనుకున్నారు. కానీ కూటమి నాయకులు కూడా ఈయనే ఉండాలని కోరుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం తోనే కాక ప్రభుత్వ విధి విధానాలు, పథకాల అమలు విషయంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉరుకులు పరుగులు పెట్టించడం కొందరికి మింగుడు పడని అంశగా మారిందని తెలుస్తోంది.
దీంతో మండల పరిషత్ పరిధిలోకి వచ్చే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈయనపై పలు ఆరోపణలు రేపుతున్నారా అన్న అనుమానాలు మండలంలో వ్యక్తం అవుతున్నాయి. దీనికి మండల స్థాయిలో ఉన్న కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారన్నది మరికొందరి ఆరోపణ. ఇదిలా ఉంటే కొందరు గుత్తేదారులు విషయంలో కూడా ఎంపీడీవో కఠినంగా వ్యవహరించడం, అడ్డగోలు బిల్లులకు మోకాలడ్డడం వంటి వాటితో అసహనంగా ఉన్నవారు ఎంపీడీవోకు వ్యతిరేకంగా కూడా బదిలీకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీ వేటు దుష్ప్రచారం వెనుక అల్లవరం సమీప ప్రాంతానికి చెందిన ఓ గుత్తేదారుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగుల పనితీరుపై నిలబెట్టే తత్వం, సమయపాలన, సెలవుల విషయంలో కఠినంగా వ్యవహరించడం వంటి అంశాలు కొందరు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఎంపీడీవో అనారోగ్యంతో సెలవు పెట్టుకుని వెళితే బదిలీ వేటు అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు నాయకుల వద్ద ఎంపీడీవో వాపోయినట్లు తెలుస్తోంది. ఇది కూడా కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై అసత్య వార్తలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుండగా తనకు ఆనారోగ్యం కారణంతోనే సెలవు పెట్టుకున్నానని, బదిలీ వేటు అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎంపీడీవో ఖండించారు. ఏది ఏమైనా అంతా ప్రీప్లాన్డ్గానే సదరు ఎంపీడీవో కృష్ణమోహన్పై దుష్ప్రచారం జరుగుతోందని, దీంట్లో కొందరు సచివాలయ, పలు శాఖల ఉద్యోగులు పాత్ర తో పాటు కొందరు కాంట్రాక్టర్లు ఉన్నారని స్పష్టం అవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే ఎంపీడీవో పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసిన కూటమి ముఖ్య నేతలు అవేమీ పట్టించుకోవద్దని సూచించినట్లు సమాచారం.