- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోతుల నియంత్రణకు చర్యలు.. త్వరలో స్పెషల్ టీమ్స్
శ్రీరాంపురం ప్రాంతంలోని పలు కాలనీలలో కోతుల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం, పైకప్పులపై సంచరిస్తూ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ..

దిశ, యూ. కొత్తపల్లి: శ్రీరాంపురం ప్రాంతంలోని పలు కాలనీలలో కోతుల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం, పైకప్పులపై సంచరిస్తూ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో కోతుల గుంపులు పెద్ద ఎత్తున తిరుగుతూ చిన్నపిల్లలు, వృద్ధులకు భయం కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల కోతులు దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇక రైతులు, ఇంటి యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు, తోటలు, ఇంటి వస్తువులు కోతుల వల్ల నష్టపోతున్నాయని వారు చెబుతున్నారు.
అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లినా...
ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు స్పందిస్తూ..
ఈ సమస్యపై అటవీ శాఖతో కలిసి చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కోతుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.






