Breaking: చంద్రబాబు సభలో స్పృహ కోల్పోయిన కార్యకర్త

by Disha Web Desk 16 |
Breaking: చంద్రబాబు సభలో స్పృహ కోల్పోయిన కార్యకర్త
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మళ్లీ అపశృతి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సభలో టీడీపీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కార్యకర్త కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను మిగిలిన శ్రేణులు సభ నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు సభ కొనసాగుతోంది. ఈ సభకు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అంతకుముందు చంద్రబాబు రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తికి చేరుకున్నారు. దేవీచౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

Also Read...

Nara Lokesh Setires: గజినీకి మారు పేరు సీఎం జగన్

Next Story