Mahanadu: మహానాడు వేదికగా చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే

by Disha Web Desk 16 |
Mahanadu: మహానాడు వేదికగా చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశంసలు కురిపించారు. రాజమండ్రిలో కొనసాగుతున్న టీడీపీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి మాట్లాడుతూ‘‘ సంకల్పం ఆయన బలం. సమాజం కోసమే ఆయన సంకల్పం. ఆయనకు వయసు పెరగదు. ఆయన స్వరం తగ్గదు. సంపదను పెంచడం తెలుసు. సంపదను పంచడం తెలుసు. పేదలను ధనికులుగా మార్చడం తెలుసు. పేదరికం లేని సమాజం కోసం పరితపించే నాయకుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదు. అప్పులలో నెట్టివేయబడినటువంటి రాష్ట్రం అంటూ దిశ, నిర్దేశం చేసేనాయకుడు. విరామం ఎరుగకుండా విసుగుచెందకుండా ప్రతికార్యకర్తను ప్రేమతో అప్యాయతతో పలకరించే తండ్రి లాంటి మనస్తత్వం ఆయనది. ఆయనే మన కుటుంబం పెద్ద. చంద్రబాబు వ్యక్తి కాదు. ఒక యూనివర్సిటీ కాదు. కొన్ని యూనివర్సిటీల సమూహమే ఆయన అని చెప్పాలి. ఆయన ఆలోచనలు, పని తీరు. ముందు చూపు, సమర్థతను ఈ దేశమే చూసింది.’ అని కొనియాడారు.

Read more:

Tdp Mahanadu: రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం

Mahanadu2023: అవి ఎవరివో చెప్పలగలవా.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

Next Story