- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాహుబలి ఎద్దులపై సవారి చేసిన జ్యోతుల నెహ్రూ, నవీన్
- చంద్రబాబు పర్యటనలో ఉపయోగించేందుకు సన్నాహాలు
దిశ, కాకినాడ: తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎద్దుల బండిపై సవారి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 15,16న జగ్గంపేట పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉపయోగించేందుకు జగ్గంపేట మండలం తెలుగు రైతు ఉపాధ్యక్షులు కురుమళ్ళ నాగేశ్వరరావు రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బాహుబలి ఎద్దులతో ఎద్దుల బండిని ఏర్పాటు చేశారు. ఎద్దుల బండిని ప్రత్యేకంగా అలంకరించి చంద్రబాబు పర్యటనలో వినియోగించనున్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంచిన ఎద్దుల బండిపై జ్యోతుల నెహ్రూ, నవీన్ సవారి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, మండల రైతు ఉపాధ్యక్షులు కురుమళ్ళ నాగేశ్వరరావు, ఉంగరాల గణేష్, కుదపవాసు, రాయి సాయి, మండపాక అప్పన్న దొర, షేక్ వల్లి, నల్లమాటి ఆనంద్ అడపా తాతాజీ, నవనాసి గణపతి తదితరులు పాల్గొన్నారు.