- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కల్తీ పాల ఘటనలో మరో మరణం నమోదు
by Vemula.Srinu Prasad |
రాజమండ్రి కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు.....

X
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry) సమీపంలోని కాలనీల్లో కల్తీ పాలు(Adulterated Milk) తాగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. మరికొంతమందికి సైతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి మరీ వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి డయాలసిస్ చేస్తున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మరో మరణం నమోదు కావడంపై బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మెరుగైన చికిత్స అందించి తమ వారిని సురక్షితంగా, ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
Next Story






