Chandrababuను తక్షణమే అరెస్టు చేయాలి..!

by Disha Web Desk 16 |
Chandrababuను తక్షణమే అరెస్టు చేయాలి..!
X

దిశ, తుని: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల ఆంక్షలను చంద్రబాబు ధిక్కరించారని ఆయన వ్యాఖ్యానించారు. నడిరోడ్డుపై సభ నిర్వహించవద్దని పోలీసులు చెప్పినా చంద్రబాబు వినలేదన్నాని మండిపడ్డారు. చంద్రబాబు నిబంధనలు పాటించకపోగా పెట్రేగిపోయాడని మంత్రి ఆరోపించారు. జీవో-1 అమల్లో ఉందని హైకోర్టు చెప్పినా..చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ఆయన ప్రశ్నించారు. నడిరోడ్డుపై సభను పోలీసులు అడ్డుకున్నందుకు చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. జెడ్‌ ప్లస్‌ కమాండోల రక్షణ ఉందని చంద్రబాబు బరితెగించాడన్నారు. గతంలో 11మందిని బలి తీసుకున్నప్పటికీ ఇంకా అదే పంథాలో చంద్రబాబు వెళ్తున్నాడని మంత్రి రాజా మండిపడ్డారు.

Next Story

Most Viewed