జనసేన నేత కందుల దుర్గేశ్ తీవ్ర ఆవేదన.. రేపు ఫైనల్ డెసిషెన్

by Disha Web Desk 16 |
జనసేన నేత కందుల దుర్గేశ్ తీవ్ర ఆవేదన.. రేపు ఫైనల్ డెసిషెన్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత కందుల దుర్గేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం రాజమండ్రి రూరల్ కాకుండా నిడదవోలు నుంచి పోటీ చేయమని కోరిందని.. తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని చెప్పారు. తనకు ఇస్తానన్న సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని జనసేన నేత కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు.

‘ రాజమండ్రి రూరల్ జనసేన కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో జనసేన కేడర్‌ను అద్భుతంగా తయారు చేశా. నాకు సీటు ఇవ్వకపోవడంతో వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో ఇప్పటికే చర్చించా. మరోసారి చర్చిస్తాం. జనసేన కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేశా. 2019లో గెలవమని తెలిసినా పార్టీ కోసం బరిలో నిలిచా. ఇప్పుడు రాజమండ్రి రూరల్ లో బాగా బలపడ్డాం. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ ఇంచార్జిగా పని చేశా. నిడదవోలులో అప్పటి పరిచయాలు ఉన్నాయి.’ అని కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.

Read More..

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ కన్‌ఫామ్.. రేపు టీడీపీలోకి..

Next Story

Most Viewed