- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముద్రగడ ఇంటిపై దాడి.. విషయం తెలిసి చాలా బాధపడిన కుమార్తె క్రాంతి

దిశ, వెబ్ డెస్క్: తన తండ్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఇంటిపై జరిగిన దాడిని ఆయన కుమార్తె, జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి(Barlapudi Kranti) ఖండించారు. కిర్లంపూడి(Kirlampudi)లో నాన్న ముద్రగడ ఇంటిపై దాడి జరిగిందని విని చాలా బాధపడ్డానని ఆమె తెలిపారు. జై జనసేన(Jai Janasena) అని చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీవారు అయిపోరన్నారు. జనసేన పార్టీలో ఇలాంటి దాడులను అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రోత్సహించరని చెప్పారు. ఈ దాడి వెనక ఎవరు ఉన్నారో పోలీసుల దర్యాప్తులో పూర్తిగా తేలుస్తామని బార్లపూడి క్రాంతి స్పష్టం చేశారు.
కాగా మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి జరిగింది. జై జనసేన అంటూ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం గేటును ఓ వ్యక్తి తోసుకుంటూ వెళ్లి కారును ఢీకొట్టారు. పెద్ద శబ్ధం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంట్లోంచి బయటకు వచ్చారు. వెంటనే ఆ డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కిర్లంపూడిలో కలకలం రేగింది. విషయం తెలియడంతో ముద్రగడ అనుచరులు ఆయన ఇంటిని భారీగా చేరుకున్నారు. ముద్రగడను పరామర్శించారు. ఏమి జరగలేదని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు.