- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్
రఘుదేవపురంలో ఇటీవల భార్యను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు కోట నూకరాజును అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు...

దిశ, సీతానగరం ప్రతినిధి: రఘుదేవపురం: మండలంలోని రఘుదేవపురంలో ఇటీవల భార్యను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు కోట నూకరాజును అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు. నిందితుడి కోడలు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఘటన వివరాలు:
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నూకరాజు కుమారుడు శ్రీను ఇటీవల గుండెపోటుతో మరణించాడు. ఈ క్రమంలో కోడలు చంద్రకళను, ఆమె పిల్లలను తాను పోషించలేనని నూకరాజు తేల్చిచెప్పాడు. అయితే, అతని భార్య సుబ్బలక్ష్మి (60) మాత్రం.. "నువ్వు ఎవరినీ పోషించాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి తన పిల్లలను తనే పెంచుకుంటుంది" అని భర్తను వారించింది. ఈ విషయంలో దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
హత్య జరిగిన తీరు:
మృతురాలు సుబ్బలక్ష్మి కోరుకొండ నరసాపురం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత, నూకరాజు ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో భార్య సుబ్బలక్ష్మి పీక కోసి హత్య చేశాడు. ఆ వెంటనే అదే కత్తితో తన గొంతును కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కిటికీలో నుంచి ఈ భీభత్సాన్ని గమనించిన కోడలు చంద్రకళ భయంతో కేకలు వేయడంతో, స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సుబ్బలక్ష్మి రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, తీవ్ర గాయాలతో ఉన్న నూకరాజును అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






