Kazuluru:ఆయన సేవలు చిరస్మరనీయం: వైసీపీ ఎమ్మెల్సీ

by Jakkula Mamatha |
Kazuluru:ఆయన సేవలు చిరస్మరనీయం: వైసీపీ ఎమ్మెల్సీ
X

దిశ, కాజులూరు: మాజీ సహకార సంఘం అధ్యక్షులు, గ్రామ పెద్ద వెలుగుబంట్ల గంగ రాజు (బూశీలు) సేవలు చిరస్మరనీయం అని వైసీపీ నాయకులు, శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. ఈ క్రమంలో నేడు(సోమవారం) గంగ రాజు కుటుంబీకులను ఓదార్చారు. గంగ రాజు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ పెద్ద గా చక్కని పాత్ర పోషించారని, ముక్కు సూటిగా, కచ్చితంగా వ్యవహా రించా రని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, టీడీపీ నాయకులు చిక్కాల అబ్బు, కాజులూరు ఉప సర్పంచ్ దండంగి చిన్న రావు, వంగా రంగా, సలాది నాన్నజీ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed