భయపెడుతున్న చెట్టు.. ప్రయాణికులు తీవ్ర ఆందోళన

by Jakkula.Mamatha |

కాజులూరు మండలం ఉండూరు - చేదువాడ రోడ్డులో కాలం చెల్లిన చెట్టు భయ బ్రాంతులకు గురి చేస్తుంది.

భయపెడుతున్న చెట్టు.. ప్రయాణికులు తీవ్ర ఆందోళన
X

దిశ,రామచంద్రపురం: కాజులూరు మండలం ఉండూరు - చేదువాడ రోడ్డులో కాలం చెల్లిన చెట్టు భయ బ్రాంతులకు గురి చేస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే చేదు వాడ నుంచి ఉండూరు వెళ్లే దారిలో ఒక చెట్టు పూర్తిగా మోడుగా మారిపోయింది. నిత్యం ఇదే రోడ్డు పై వందలాది ప్రయాణికులు పయనిస్తూ ఉంటారు. మోడుబారిన చెట్టు ఎప్పుడు కూలిపోతుందో అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపా తడపా వర్షాలు కురవడం వల్ల ఈదురు గాలులకు చెట్టు పడిపోయే పరిస్థితి ఉంది. దీంతో అనేక మంది భయ బ్రాంతులకు గురి అవుతున్నారు. విషయమై అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Next Story