Chandrababu: వరపుల రాజా మృతిపై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Chandrababu: వరపుల రాజా మృతిపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత వరపుల రాజా మృతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరపుల రాజా మృతి చెందిన విషయం తెలిసిందే. వరపుల రాజా భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు... ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వరపుల రాజా మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమన్నారు. వరపుల రాజాపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. ఆ కేసుల ఒత్తిడి వల్లే వరపుల రాజాకు గుండెపోటు వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరపుల రాజా హఠాన్మరణం చెందారు. రాజా ఇంట్లో హఠాత్తుగా పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులను ఆయనను కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వరపుల రాజా మృతి చెందారు. గుండెపోటు రావడంతోనే వరపుల రాజా చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. వరపుల రాజా మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరపుల కుటుంబ సభ్యులను పరిమర్శించారు.


Next Story

Most Viewed