- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాన్షాపు మాటున మద్యం దందా.. బాత్రూమ్ లోకి వెళ్లి చూడగా అంతా షాక్!

దిశ, అల్లవరం: పైకి మాత్రం పాన్షాపు కలరింగ్.. లోన జరిగే యవ్వారం మాత్రం బెల్ట్ దందా. అది కూడా ఏ మా ఊరు మూలనో లేక ఊరి చివరనో కాదు.. ఏకంగా మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న కాంప్లెక్స్లో జరుగుతోంది. అల్లవరం మండల గుడ్డివాని చింత వద్దనున్న గుబ్బల వారి పాలెం పరిధిలోని గుబ్బల రవి కాంప్లెక్స్లో పాన్షాపుమాటున మద్యం అమ్మకాలను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. లక్ష్మమ్మ పాన్షాపు పేరుతో నడుపుతున్న ఈ దుకాణం వెనుక ఉన్న బాత్రూమ్పైన కంట పడకుండా పేర్చిన 36 మద్యం సీసాలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈకాంప్లెక్స్లో గత కొన్ని రోజులుగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న పక్కాసమాచారంలో అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్కుమార్ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 36 మద్యం సీసాలు లభ్యం కాగా పాన్షాపు నిర్వాహకుడు వెదుళ్లపాలెంకు చెందిన మామిడిశెట్టి వెంకటసత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కంట పడకుండా బాత్రూమ్పై పేర్చి..
మొదట షాపులో అన్నిచోట్ల వెతికినా మద్యం సీసాలు లభ్యం కాకపోగా అనుమానంతో బాత్రూమ్లో వెతికినా కనిపించలేదు. అయితే సీఐ ప్రశాంత్కుమార్ సిబ్బందిని బాత్రూమ్ పై భాగంలో పరిశీలించాలని ఆదేశించడంతో అక్కడ కనిపించకుండా పండబెట్టిన 36 మద్యం నిబ్బులను గుర్తించారు. సంక్రాంతి సందర్భంగా ఈ కాంప్లెక్స్ వెనుక కోడిపందేల నిర్వాహణ సందర్భంలోకూడా ఇక్కడ జోరుగా మద్యం విక్రయాలు జరిగాయని, అప్పటి నుంచి ఎటువంటి బెరుకు లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపట్టారని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఇదే షాపులో పార్టీషన్ చేసి అక్కడే మద్యం సేవించేలా ఏర్పాట్లు చేశారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అల్లవరం ఎస్సై హరీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.