పట్ట పగలే ఆలయంలో చోరీ.. హుండీలో సొమ్మంతా అపహరణ

by Jakkula Mamatha |
పట్ట పగలే ఆలయంలో చోరీ.. హుండీలో సొమ్మంతా అపహరణ
X

దిశ,తుని: కాకినాడ జిల్లా తునిలో పట్ట పగలు చోరీ కలకలం రేపింది. హైవే పక్కన డిమార్ట్ ఎదురుగా ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఓ యువతి, ఇద్దరు యువకులు కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రవేశించిన యువతి, యువకులు ప్రసాదాన్ని తీసుకొని తిన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేకపోవడంతో హుండీలో ఉన్న సొమ్మంతా ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed