రైల్వే వంతెన వద్ద ఆగిపోయిన లారీ.. నిలిచిన ట్రాఫిక్‌

by Jakkula Mamatha |
రైల్వే వంతెన వద్ద ఆగిపోయిన లారీ.. నిలిచిన ట్రాఫిక్‌
X

దిశ,తుని: కాకినాడ జిల్లా తుని శివారు చామవరం రైల్వే గేట్ సమీపంలో భారీ లారీ ఇనుప గడ్డరు వద్ద ఇరుక్కుపోయింది. గేటు వద్ద ఎత్తైన, భారీ వాహనాలు వెళ్ళకుండా గేటుకు రెండు వైపులా ఎత్తులో ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేశారు. శనివారం భారీ కంటైనర్ ఈ మార్గంలో వెళ్తూ గేట్ దాటిన తర్వాత ఇనుప గడ్డరు వద్ద ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీని బయటకు తీశారు.



Next Story

Most Viewed