ఆ దేవాలయంలో చోరీ.. 5 కిలోల వెండి అపహరణ

by Jakkula Mamatha |
ఆ దేవాలయంలో చోరీ.. 5 కిలోల వెండి అపహరణ
X

దిశ, అల్లవరం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గత కొన్ని రోజులుగా దేవాలయాలే టార్గెట్‌గా చేసుకుని దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస దొంగతనాల పై పోలీసులు దృష్టిపెట్టిన ఆగడం లేదు. ఈ క్రమంలోనే అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో గురువారం అర్ధరాత్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయం లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆపై గర్భగుడిలో ఉన్న 5 కిలోల వెండి సామాగ్రి అపహరించారు. అర్ధరాత్రి 12.34 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు ముఖానికి మాస్కులు పెట్టుకుని వచ్చి వెలుగుతున్న విద్యుత్ బల్బులను ఒక్కొక్కటి తీసేశారు.

ఆపై సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఆపై గర్భగుడికి ఉన్న గేటు తాళం పగులగొట్టి లోన ఉన్న వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉంటే ధ్వంసం చేసిన సీసీ కెమెరాలను పక్కనే ఉన్న కొళాయి చెరువులో పడేశారు. గ్రామస్తులు ఉదయాన్నే గుడిలోకి వెళ్లి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండడంతోపాటు చిందరవందరగా ఉండడంతో అర్చకునికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story