విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఢిల్లీ నుంచి విజయవాడ(Vijayawada)కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story