Minister Kandula Durgesh:ఈ నెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు.. కీలక అంశాలపై చర్చ

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-12 12:11:15  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

Minister Kandula Durgesh:ఈ నెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు.. కీలక అంశాలపై చర్చ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల(డిసెంబర్) 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) పరిశ్రమ హోదా కల్పించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Next Story