తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

by Naga Rani Yarlagadda |

రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి, సుప్రభాతసేవ, స్వామివారికి పూజా కైంకర్యాల నిర్వహణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తోంది టీటీడీ.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి, సుప్రభాతసేవ, స్వామివారికి పూజా కైంకర్యాల నిర్వహణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తోంది టీటీడీ. గ్రహణానంతరం తిరుమల ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని 27,410 మంది భక్తులు దర్శనం చేసుకోగా.. హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

Next Story