తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే

by Naga Rani Yarlagadda |

తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) వెల్లడించింది. రూ.300 ల శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 70,480 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చింది. అలాగే స్వామివారికి 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Next Story