- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి ఐక్యతే రాష్ట్రానికి శ్రీరామరక్ష : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కూటమి పార్టీలు ఐక్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యతే అత్యంత కీలకమని, ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు 'తెలుగు జాతి ఆత్మగౌరవం' అనే మహోన్నత ఆశయంతో స్థాపించిన ఈ పార్టీ, ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖించిందని ఆయన స్మరించుకున్నారు. నాలుగు పదుల కాలంగా ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలవడంలో టీడీపీ చూపిన పోరాట పటిమ సామాన్యమైనది కాదని పవన్ అభిప్రాయపడ్డారు.
అపార అనుభవంతోనే ముందడుగు
పార్టీ ప్రయాణంలో ఎదురైన ఎన్నో కఠిన సవాళ్లను, సంక్షోభాలను నారా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సమర్థవంతంగా అధిగమించారని పవన్ కొనియాడారు. క్లిష్ట సమయాల్లో ఆయన ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపాయని పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే కాకుండా, రాష్ట్ర పురోగతిని, ప్రజల బాగును కాంక్షిస్తూ చంద్రబాబు పార్టీని నడిపించిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
కూటమి ఐక్యతే రాష్ట్రానికి శ్రీరామరక్ష
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పథంలోనూ, ప్రజల పక్షాన నిలబడి పోరాడటంలోనూ చంద్రబాబు తనదైన ముద్ర వేశారని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, అభివృద్ధి కేవలం కూటమి ఐక్యతతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇదే స్నేహాన్ని, సమన్వయాన్ని భవిష్యత్తులోనూ మరింత బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి అడుగులు వేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






