- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేం వేసిన రోడ్లపై నడుస్తూ అభివృద్ధి కాలేదని విమర్శిస్తావా?
by Disha Web Desk 7 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు. లోకేశ్ పాదయాత్ర శవయాత్రలా ఉందని విమర్శించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర అంటే ఒక పటుత్వం ఉండాలి కానీ అది లోకేశ్ పాదయాత్రలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై నడుస్తూ ఏం అభివృద్ధి కాలేదని విమర్శించడేమంటని ప్రశ్నించారు. సైకోకు సంబంధించిన పాదయాత్రగా కనిపిస్తుందే గానీ ప్రజల సమస్యలు తెలుసుకునే చేపట్టిన పాదయాత్రలా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుది ఔరంగాజేబు మనస్తత్వం అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు.
Next Story