Ycp: టీడీపీ మేనిఫెస్టోపై మండిపాటు.. వెన్నుపోటంటూ సెటైర్స్

by Disha Web Desk 16 |
Ycp: టీడీపీ మేనిఫెస్టోపై మండిపాటు.. వెన్నుపోటంటూ సెటైర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో వెన్నుపోటు మేనిఫెస్టో అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. మినీ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధాలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇలాంటి మేనిఫెస్టోలను ఎన్ని విడుదల చేసినా...ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు మహానాడులో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. పిల్లనిచ్చి, రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన నీచుడు చంద్రబాబు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు.

టీడీపీ మేనిఫెస్టో దరిద్రం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి మినీ మేనిఫెస్టో అంటూ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో ఏం చేశాడో చెప్పుకోడానికి ఏమీ లేకపోవడంతో మళ్లీ మినీ మేనిఫెస్టో అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబాబు నాయుడు ఇది చేశామని ఒక్క పథకమైనా చెప్పగలరా అని నిలదీశారు. కానీ అబద్దాలు చెప్పడంలో మాత్రం చంద్రబాబుకు గిన్నీస్‌ రికార్డు ఇవ్వొచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed