ఏపీకి తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం

by Disha Web Desk 21 |
ఏపీకి తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాయుగుండం డిసెంబర్ 2కి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. డిసెంబర్ 3 నాటికి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

Next Story

Most Viewed