దేవస్థానం సమీపంలో గంజాయి పట్టివేత

by Disha Web Desk 7 |
దేవస్థానం సమీపంలో గంజాయి పట్టివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లా గురజాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అమరలింగేశ్వర దేవస్థానం సమీపంలో భారీ స్థాయిలో గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమరలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఒక పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు గురజాల సెబ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో సెబ్ అధికారులు శనివారం తెల్లవారు జామున గంజాయి సాగు చేస్తున్న పొలాన్ని గుర్తించారు. సాగు చేస్తున్న రైతు, పొలం వివరాలను సేకరించారు. గంజాయి పంటను మెుత్తం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed