- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) తిరుమలలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి NG షెడ్స్ వరకు వేచి ఉన్నారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.






