Odisha train accident: రాజమహేంద్రవరంకు చెందిన 21 మంది సేఫ్

by Disha Web Desk 19 |
Odisha train accident: రాజమహేంద్రవరంకు చెందిన 21 మంది సేఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ప్రమాదానికి గురైంది. ఈ రైలులో ఏపీ, రాజమహేంద్రవరంకు చెందిన 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో 21 మంది సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆ రైలులో రాజమహేంద్రవరంకు చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారి బంధువులు స్థానిక రైల్వేస్టేషన్‌లోని హెల్ప్‌లైన్‌ నంబర్ల (08832420541, 0883-2420543)కు సంప్రదించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘోర రైలు ప్రమాదం వల్ల పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. దీంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో రద్దీ వాతావరణం ఏర్పడింది.

Also Read..

Odisha Train Accident: :కోరమండల్ రైలు ప్రమాదంలో 270 మంది మృతి.. అభిమానులకు చిరు కీలక పిలుపు!

Next Story

Most Viewed