Tirumala News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు

Tirumala News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(గురువారం)శ్రీవారిని 62,129 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,026 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.13 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story